ఇటీవల కాలంలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు సిద్ధార్ధ్ రెడ్డి తెలిపారు. ఈనెల 7వ తేదిన వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.