పవన్‌కు బుద్దా వెంకన్న సవాల్..

Update: 2018-12-09 07:01 GMT

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. ఆదివారం మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, జగన్ లపై మండిపడ్డారు. వాళ్ల కంటికి చంద్రబాబు తప్ప మరేవరూ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబును తానే అధికారంలోకి తెచ్చనంటున్న జనసేన అధినేతకు పవన్ కు సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దుతుగా ఉండి గెలిపించే సత్తా ఉందా అని సవాల్ విసిరారు. ప్రజలకోసమే అనుక్షణం పాటుతుంటే పవన్ కళ్యాణ్ వోర్వలేక పోతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కలుపు మొక్కలను ఏరిపారేసేందుకే సీఎం చంద్రబాబు రాజకీయ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.

Similar News