ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై చర్యలెందుకు తీసుకోలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడేళ్లుగా ఈ కేసులో చర్యలు లేవంటే... ఇక సామాన్యునికి ఏం న్యాయం జరుగుతుందని అన్నారు. చట్టం, రాజ్యాంగంపై తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం ఉంటే ఓటుకు నోటు కేసు విచారణను నిష్పక్షపాతంగా చేయాలని బొత్స సూచించారు.