అధికార టీఆర్ఎస్ లో అసమ్మతి కొనసాగుతూనే ఉంది. టిక్కెట్లు రాని వారు.. అధిష్టానంపై ఎదురుతిరుగుతున్నారు. తాజాగా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కారు దిగేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన 105 మంది లిస్టులో ఆమె పేరు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనిపై గత కొన్నిరోజులుగా కేసీఆర్, కేటీఆర్లను కలిసి వివరణ కోరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ టిక్కెట్ రాదని కన్ఫర్మ్ అయితే కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.