తెలంగాణలో నోటిఫికేషన్ వెలువడిన తొలి రోజే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇందిరాపార్క్ సమీపంలోని గణపతి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్కు బయలుదేరారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సీనియర్ నేతలు, ఎంపీల నడుమ ర్యాలీకి వెళ్లి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో గడచిన నాలుగున్నరేళ్లలో బీజేపీయే ప్రతిపక్ష పాత్ర పోషించిందని ప్రజలు తమ వైపే ఉన్నారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.