విభజన హామీల సాధనకై ఏపీలో జేఏసీ ఏర్పడటం శుభ పరిణామమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని విభజన హామీలను అమలు చేసిందో జేఏసీ తేల్చాలని సూచించారు. విభజన చట్టం అమలు గురించి అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న వాదోపవాదాల్లో ఏది నిజమో... ఏది కాదో తేల్చే బాధ్యతను జేఏసీ తీసుకోవాలని సోము వీర్రాజు కోరారు.