తెలంగాణలో హంగ్ వస్తే టీఆర్ఎస్కు మద్దతిచ్చే అవకాశం లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగరరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు మద్దతిస్తామని బీజేపీ నేతలు ఎవరూ ప్రకటించలేదని స్పష్టం చేశారు. అయితే బీజేపీ మద్దతును తిరస్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని కృష్ణ సాగరరావు ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అమరావతికి సర్దుకోవాలని ఎద్దేవా చేశారు. రేపు (మంగళవారం) వెలువడే ఫలితాలు కాంగ్రెస్, టీడీపీ చెంప చెల్లుమనిపిస్తాయని జోస్యం చెప్పారు. టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డికి గడ్డం గీసుకునే యోగం లేదని, కొందరు కాంగ్రెస్ నేతలకు డబుల్ డిజిట్ ఓట్లు కూడా రావని అన్నారు. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేది లేదని, తాము ఆ పార్టీకి వ్యతిరేకమని ఆయన వెల్లడించారు.