కాంగ్రెస్ రెబల్స్ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన భిక్షపతి యాదవ్ అధిష్టానం హామీతో మెత్తబడ్డారు. అగ్రనేతల సూచన మేరకు ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. మహాకూటమి అభ్యర్ధి భవ్య ఆనంద్ ప్రసాద్కు తన మద్దతు ప్రకటించారు. భిక్షపతి యాదవ్తో కాంగ్రెస్ సీనియర్ నిన్న రాత్రి నుంచి పలు దఫాలుగా చర్చలు జరిపారు. జైపాల్, అజాద్ సూచనతో పోటీ నుంచి భిక్షపతి యాదవ్ తప్పుకున్నారు.