మహిళను నగ్నంగా ఊరేగించారు..

Update: 2018-08-21 06:14 GMT

బిహార్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని చంపిందనే నెపంతో కొందరు వ్యక్తులు ఓ మహిళపై దాడి చేశారు. అంతటితో ఆగక నగ్నంగా ఆమెను ఊరేగించారు.బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలోని దామోదర్‌పూర్‌లో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. విమలేశ్ షా(19) అనే యువకుడు ఆదివారం అదృశమయ్యాడు. సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద విమలేశ్ మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. 

దీంతో ఆగ్రహించిన దామోదర్‌పూర్ గ్రామస్తులు.. రైల్వేట్రాక్ పక్కనే ఉన్న రెడ్ లైట్ ఏరియాపై దాడి చేశారు. అక్కడున్న ఉన్న షాపులను ధ్వంసం చేసి.. వాహనాలను తగులబెట్టారు. అనుమానంతో ఓ మహిళను ఆమె ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా చితకబాదారు. యువకుడిని ఆ మహిళనే హత్య చేసి ఉంటుందని భావించి.. నగ్నంగా ఊరేగించారు. చెప్పులతో దారుణంగా కొట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వారు రెడ్ లైట్ ఏరియాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Similar News