ఏపీలో ఆ ఓట్లపై అనుమానం : ఎన్నికల అధికారి సిసోడియా

Update: 2018-11-20 15:44 GMT

ఏపీలో ఓటర్‌ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిల్ దాఖలవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా స్పందించారు. 175 నియోజకవర్గాల్లోని ఓటర్‌ జాబితాను పరిశీలించినపుడు 25లక్షల ఓట్లపై అనుమానం వచ్చిందన్నారు. కాగా ఏపీలో  52 లక్షల డూప్లికేట్ ఓట్లు నమోదైనట్లు హైకోర్టులో పిల్‌ దాఖలు అయితే.   తమ లెక్కల ప్రకారం ఆస్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉండవని చెబుతున్నారు సిసోడియా. అనుమానం వచ్చిన ఓట్లపై  బూత్‌ లెవల్ ఆఫీసర్లతో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. దొంగ ఓట్ల ఏరివేత ఇప్పటికే పని ప్రారంభించినట్లు సిసోడియా చెప్పారు.

Similar News