రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణం...ఉప ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలెట్‌ ప్రమాణం

Update: 2018-12-17 07:43 GMT

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఉప ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలెట్‌  ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కల్యాణ్ సింగ్ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ చేత ప్రమాణం చేయించారు. ఆల్‌బర్ట్‌ హాల్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాని దేవేగౌడ, ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమార స్వామితోపాటు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, జమ్మూ కాశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా హజయ్యారు. ఆర్జేడీ నేత తేజశ్వని యాదవ్‌, యూపీ నేతలు మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

Similar News