అమ్మాయిలకు స్కూటీలు, 10 లక్షల ఉద్యోగాలు..

Update: 2018-11-17 12:34 GMT

ఎన్నికలు వస్తున్నయంటే చాలు హోరాహోరిగా ప్రచారంలో దూసుకుపోతుంటారు నేతలు, ప్రజలకు అరచేతిలోనే ఆకాశాన్ని చూప్తిస్తారు, ఇక హామీలకైతే హద్దే ఉండదు. అవి నేరవేరుస్తారో లేదో తెలియదు కాని హామీల వర్షం కురిపిస్తారు నేతలు. తాము ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రాని హైదరాబాద్ తరహాలో మెట్రోరైలు, పది లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీ అందజేస్తామని  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ లు నేడు మేనిఫేస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి  జైట్లీ మాట్లాడుతూ ప్రజల కనీస జీవన ప్రమాణాలు పెంచడమే తమ అజెండా అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News