పెథాయ్ తుపాను తీవ్రత తూర్పు, పశ్చిమ గోదావరి విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాలపై ఉంటుందని హోంమంత్రి చిన రాజప్ప వెల్లడించారు. అధికారులు విడుదల చేసిన వివరాల సోమవారం కూడా అదే తీవ్రతతో కొనసాగి మధ్యాహ్నం ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం తాకొచ్చని అదే తీవ్రతతో విశాఖ వైపుగా దిశ మార్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకి 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.