ప్రణయ్ హత్య కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు...అమృతను మర్చిపోతే కోటిన్నర ...
ప్రణయ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో మారుతీరావు నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అమృతను మర్చిపోతే కోటిన్నర ఇస్తానంటూ ప్రణయ్కు మారతీరావు ఆఫర్ ఇచ్చాడని.. మిర్యాలగూడ వదిలివెళ్లాలంటూ ప్రణయ్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చినట్టు విచారణలో తేలింది. ప్రణయ్, అమృత కలిసి ఉన్న వీడియో, ఫొటోలు చూసి.. వారిపై మహుతీరావు మరింత కక్ష పెంచుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. ప్రణయ్ హత్య కేసులో నిందితులను సాయంత్రం 5 గంటలకు.. పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.