తెలంగాణలో త్రిముఖ పోరు..

Update: 2018-12-02 11:22 GMT


అధినాయకుల రంగ ప్రవేశంతో తెలంగాణ ఎన్నికలు, రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల్లో మరింత ప్రచార హోరుతో హీటెక్కుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోరు సాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం ముందు ముందు ఆత్మాభిమానం తాకట్టుపెట్టిందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు నిలువలేమనే భయంతో ముందస్తుకు కేసీఆర్‌ మొగ్గుచూపారని విమర్శించారు. కెసిఆర్ కేవలం తన కుటుంబసభ్యుల కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్లి కోట్లరూపాయల ప్రజలసోమ్ము అడ్డగొలుగా ఖర్చుచెస్తున్నారని మండిపడ్డారు. గడిచిన నాలున్నరేండ్ల కాలంలో కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటికూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఎంతో బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నారాయణపేట అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.

Similar News