ఎన్నికలొస్తాయి.. సిద్ధం కండీ: అమిత్‌ షా

Update: 2018-09-04 08:04 GMT

ముందస్తు ఎన్నికలకు కాషాయ పార్టీ  రెడీ అవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికలు వస్తాయంటూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నెల 12 లేదా 15న మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఆ తర్వాత నిజామాబాద్‌ లేదా కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్‌ నేతలతో కిషన్‌ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. 

Similar News