తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి, అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ఆయన వరుసగా ఐదోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సీతారాం రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇసాబినోబైద్ మిస్రీ, బీజేపీ నుంచి సయ్యద్ షహజాదీ పోటీ చేస్తున్నారు. ఎంఐఎంకు కంచుకోట వంటి చాంద్రాయణ గుట్టలో అక్బరుద్దీన్ గెలుపును ముందుగానే అందరూ ఊహించారు.