షాకింగ్... ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య

Update: 2018-07-30 10:38 GMT

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ వీడకముందే జార్ఖండ్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంచీలోని కంకే ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాంచీలో కంకే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ కుటుంబం నివసిస్తోంది. వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా  ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇప్పటికే విచారణ ప్రారంభించామని స్థానిక పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

Similar News