కువైట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది భారతీయులు మృతిచెందారు. బుర్గాన్ చమురు నిక్షేపాల్లో విధులు ముగించుకున్న కార్మికులు.. 2 బస్సుల్లో ఇళ్లకు తిరుగుప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 11 మంది భారతీయులతో పాటు ఈజిప్ట్, పాకిస్తాన్కు చెందినవారున్నారు.