West Godavari Upadtes: జీలుగుమిల్లిలో అక్రమంగా తరలిస్తున్న ఎరువులను పట్టుకున్న పోలీసులు..
పశ్చిమ గోదావరి జిల్లా
* జీలుగుమిల్లిలో అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను పట్టుకున్న పోలీసులు..
* పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను పోలీసులు పట్టుకున్నారు.
* అనంతరం ఆ బస్తాలను వ్యవసాయ అధికారులకు అప్పగించారు.
* వీటిని జంగారెడ్డిగూడెం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు.
* స్వాధీనం చేసుకున్న ఎరువులను కామయ్యపాలెం డీసీఎంఎస్ దుకాణంలో భద్ర పరిచామని మండల వ్యవసాయ అధికారి పార్వతి తెలిపారు.
* ఎరువుల తరలింపులో ఈపాస్ బిల్లులు తప్పనిసరిగా ఉండాలని ఏవో చెప్పారు.
* రైతుల పేరిట ఎరువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
Update: 2020-11-03 11:29 GMT