Telangana High Court Updates: సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ..

  టీఎస్ హైకోర్టు....

-కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించ వద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

-కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు పరిశీలించవచ్చునన్న హైకోర్టు

-కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వచ్చిందన్న ఏజీ ప్రసాద్

-అక్టోబరు 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయి

-అక్టోబరు 29 నుంచి నిన్నటి వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయి

-రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు

-పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు కోరిన అడ్వకేట్ జనరల్ ప్రసాద్

-తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులు పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశం

-2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు

-నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే పిల్ పై హైకోర్టు విచారణ

Update: 2020-11-11 11:49 GMT

Linked news