Neredmet Updates: నెరేడ్ మెట్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

హైదరాబాద్ :

- నెరేడ్ మెట్ లో ప్రమాదవశాత్తు నాలలో పడి మృతి చెందిన సుమేధ (12) ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన న్యాయవాది మామిడి వేణు మాధవ్.

- నగరంలో ఓపెన్ నాలల మృత్యు కుహరాలుగా మారుతూ పిల్లల ప్రాణాలు తీస్తూ... తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది.

- వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఆరోపణ.

- ఓపెన్ నాలలపై కప్పులు వేసి , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసే విధంగా.... ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించాలంటూ కమిషన్ ను కోరిన న్యాయవాది.

Update: 2020-09-19 12:37 GMT

Linked news