Corona Updates In srikakulam: పేషంట్ ఆచూకీ తెలపాలంటూ బంధువులు ఆందోళన

శ్రీకాకుళం జిల్లా: జిల్లా కోవిడ్ ఆసుపత్రి వద్ద పేషంట్ ఆచూకీ తెలపాలంటూ బంధువులు ఆందోళన..

జులై 31 న కోవిడ్ ఆసుపత్రిలో చేరిన ధర్మాన గణపతి రావు..

గణపతి రావు స్వస్థలం నందిగాం మండలం దిమ్మిడిజోల..

అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి రావును పలాస ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

కోవిడ్ అనుమతిని లక్షణాలు ఉండడంతో జెమ్స్ కు తరలించాలని చెప్పిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు..

పది రోజులుగా జెమ్స్ సిబ్బంది కనీస సమాచారం ఇవ్వడం లేదని కుటుంబ సభ్యుల ఆవేదన..

రెండు రోజుల నుంచి గణపతి రావు కనిపించడం లేదని తెలిపిన ఆసుపత్రి సిబ్బంది..

పరిస్థితి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన గణపతి రావు కుటుంబీకులు..

గణపతి రావు ఆచూకీ తెలపాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా..

Update: 2020-08-29 15:26 GMT

Linked news