కోదండరెడ్డి కిసాన్ కాంగ్రెస్ జాతీయ... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కోదండరెడ్డి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు..

అన్వేష్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్

ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది..

నిన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి పరిశీలన బృందం వచ్చింది. మేము రాష్ట్రంలో జరిగిన నష్టాలను లేఖ రూపంలో తెలియజేశాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్టం అంచనాలు వేయలేదు.

వైపరీత్యాలు జరగ్గానే నష్టం వివరాలు కేంద్రానికి తెలియజేయాలి..కానీ బృందం వచ్చే వరకు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు..

బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ లు వరదలను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. వరికి ఎకరానికి 20 వేలు, పత్తి ఇతర పంటలకు ఎకరానికి 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసాము..

టిఆర్ఎస్ కేవలం బీజేపీని నామమాత్రంగా వ్యతిరేస్తుంది. కేంద్రంలో మూడు వ్యవసాయ చట్టాలు తెస్తే వాటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో లో తీర్మానం చేయలేదు..

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు, వ్యవసాయానికి చాలా నష్టం చేస్తున్నాయి..

రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను నామమాత్రంగా కాకుండా అసెంబ్లీలో తీర్మాణం చేయాలి.

Update: 2020-10-24 07:57 GMT

Linked news