Bandi Sanjay: హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి: బండిసంజయ్

బండిసంజయ్. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు విడుదల చేసిన ప్రకటన 

గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు.

హైకోర్టు తీర్పును వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి.

హైకోర్టు తీర్పును గౌరవించే అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఇది హిందువుల విజయం

అయినా అడ్డంకులు సృష్టిస్తే ఖబర్దార్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో గణేష్ మండపాలపై నిషేధం విధించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది, హిందువులు యధావిధిగా మండపాలలో గణేష్ నవరాత్రులు జరుపుకోవచ్చని తీర్పునిచ్చింది, ఈ తీర్పు హిందువుల పై పక్షపాతానికి చెంప పెట్టు లాంటిదని అభివర్ణంచారు.

రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను తెలంగాణ హిందూ సమాజం ఎన్నటికీ మరువదు.

గత పది రోజుల నుండి పోలీసులు చేస్తున్న అరాచకాలు, భయభ్రాంతులను తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటుంది.

కోర్టు అనుమతి ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ప్రజలు గమనిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కరోనా నిబంధనలు పాటిస్తూ, కోర్టు తీర్పు మేరకు నిరాటంకంగా మండపాలలో గణేష్ నవరాత్రులు జరుపుకుంటాం.

Update: 2020-08-21 17:29 GMT

Linked news