AP Panchayat Elections 2021 Live UPdates: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కందులూరులో వైసీపీ అభ్యర్థి వర్గం, రెబల్ అభ్యర్థి వర్గం మధ్య ఘర్షణ నెలకొంది. ఓ వృద్ధురాలిని పోలింగ్‌ బూత్‌లోకి తీసుకెళ్లే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వన్‌టౌన్‌ సీఐ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. 

Update: 2021-02-09 06:17 GMT

Linked news