AP Panchayat Elections 2021 Live UPdates: సర్పంచ్‌ అభ్యర్థి విజయలక్ష్మి ఆందోళన

కర్నూలు జిల్లా యాగంటిపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్‌ అభ్యర్థి విజయలక్ష్మి ఆందోళనకు దిగారు. ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్‌ను విత్‌ డ్రా చేశారంటూ విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. పెట్రోల్‌ బాటిళ్లతో పోలింగ్‌ కేంద్రం దగ్గర ధర్నాకు దిగిన అభ్యర్థి విజయలక్ష్మి న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Update: 2021-02-09 05:18 GMT

Linked news