ఘనంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు

ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ముమ్మిడివరం, కేసనకుర్రు, కాట్రేనికోన గ్రామాల్లో డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

- కేసనకుర్రులో దివంగత వైఎస్సార్ శిలా విగ్రహాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- ఎమ్మెల్యే సతీష్ కుమార్ రైతు దినోత్సవంను పురస్కరించుకొని భారీ కేక్ ను కట్ చేశారు.

- ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిన్నంరాజు వెంకట్ పతి రాజు, కాశి శ్రీహరి, బుడితి నాగన్న, చికం రాంబాబు, బాబిజి రాజు, పెద్ద బాబు, సలాది సే షారావు తదితరులు పాల్గొన్నారు.




Update: 2020-07-08 11:12 GMT

Linked news