బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కాషాయం రంగు మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గీయులు.. చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారంటూ బీజేపీ వర్గీయులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. గులాబీ కండువాలతో పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించిన బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి.. ఇదేమిటి అంటూ బీజేపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ స్టేషన్లు 43, 44, 45, 46, 47, 48, 49 వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Update: 2020-12-01 06:25 GMT

Linked news