సి.ఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు

వాహనమిత్ర పధకం ద్వారా ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న రూ 10,000 సాయం చేయడం ఆయా కుటుంబాలకు ఎంతో ఆసరా ఇస్తుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. వాహన మిత్ర ద్వారా సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఆటోడ్రైవర్లు స్థానిక చింతచెట్టు సెంటర్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారన్నారు. అధికారం చేపట్టిన ఏడాది లోపే 90 శాతం హామీలను నెరవేర్చున ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావుతో పాటు పలువురు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.



 


Update: 2020-06-04 09:29 GMT

Linked news