బోరుబావిలో మూడున్నరేళ్ళ బాలుడు!

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో దారుణం జరిగింది.

పంట పొలం కోసం తవ్విన బోరుబావిలో.. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తూ పడ్డాడు.

దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కాగా ప్రస్తుతం 120-150 అడుగుల బోరుబావి లోతులో బాలుడు ఉన్నాడు. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది రెస్య్యూటీమ్.

అలాగే సంఘటనా స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకున్నాయి.  

 


Update: 2020-05-27 14:36 GMT

Linked news