దేశ సంపదను దోచి పెడుతున్నారు: సీపీఎం

విజయవాడ: సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిలు రామకృష్ణ, మధు

నరేంద్రమోదీ కార్పొరేట్ రంగానికి దేశ సంపదను దోచి పెడుతున్నారు

ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ నిర్వీర్యం చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం తక్షణం వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు(29,30,1 తేదీల్లో)అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలకు పిలుపునిస్టున్నాం

కేంద్రంలో ఉన్న పెద్దలకు సీఎం జగన్ వంగి వంగి దండాలు పెడుతున్నారు

4వేల కోట్ల అప్పు కోసం విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు

విద్యుత్ మీటర్లు బిగించిన రోజు నుండే జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం మొదలవుతుంది

టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి. ఇక్కడ ఒకలా పార్లమెంట్ లో ఒకలా టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు

మూడు రోజుల నిరసన దీక్షలు తరువాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం

రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు

చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలు చేస్తున్నారు

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పై మడమ తిప్పి బీజేపీతో కలిశాడు

అంతర్వేది ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి

ఇల్లు తగులబెట్టి బొగ్గులు ఎరుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది

Update: 2020-09-26 08:00 GMT

Linked news