రెండు, మూడు రోజుల్లో రైల్వే కౌంటర్లలో టికెట్‌ బుకింగ్‌..పీయూష్‌ గోయల్‌..

రైల్వే రిజర్వేషన్లకు భారీగా స్పందన వస్తోందని. నిమిషాల్లోనే లక్షల టికెట్లు అమ్ముడుపోయయాని. వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్న రైల్వే సర్వీసుల కోసం ఈ రోజు ఉదయం 10 నుంచి ఆన్‌లైన్ రిజర్వేషన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

రేపటి నుంచి దేశంలో ఉన్న 1.7 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లలోనూ టికెట్లు బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

రెండు మూడు రోజుల్లో ఎంపిక చేసిన రైల్వే కౌంటర్లలో కూడా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. 

Update: 2020-05-21 09:22 GMT

Linked news