టిడిపి తప్పిదాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి: మంత్రి కన్నబాబు

అమరావతి

మంత్రి కన్నబాబు కామెంట్స్

ఎన్సిఆర్బి ప్రకారం 1029 మంది రైతులు గత ఏడాది చనిపోయారు.

అందులో 401 మంది రైతు కూలీలు అని చెప్తున్నారు

రైతులు అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వెంటనే అందరికీ పరిహారం అందిస్తున్నాం

రైతు భరోసా అమలు చేస్తున్న తీరు అందరూ చూస్తున్నారు

2020-21 లో 49.45 లక్షల కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించాం

ఇప్పటి వరకు 10200 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం

రైతులకు అనేక పథకాలు అందిస్తున్నాం

పొగాకు కొనుగోళ్లు సైతం మొదటి సారి చేపట్టాం

ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో అనేక పంటలు కొనుగోలు చేసింది

త్వరలోనే రైతు భరోసా కేంద్రాలు నుండి కొనుగోలు కార్యక్రమాలు జరగనున్నాయి

ప్రతిపక్ష నాయకులు రెచ్చిపోయి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు

2019 లో టిడిపి పరిపాలన కూడా సాగింది.... వారి తప్పిదాల వల్లే ఆత్మహత్యలు పెరిగాయి

2020 లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి

చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించాం

ఇప్పటివరకు 2020 లో 157 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు

గ్రామ స్థాయి లో విత్తనాలు అందించాం అసలు క్యు లైన్లు లేకుండా చూసాం

క్యు లైన్లో ఉండి గుండెపోటు వచ్చే చనిపోతున్నారు అని చంద్రబాబు ఆరోపించడం దారుణం

Update: 2020-09-03 14:04 GMT

Linked news