శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే పోస్టులు పెట్టోదు: డీజీపీ మహేందర్ రెడ్డి

 పౌరులకు విజ్నప్తి: సోషల్ మీడియాలో విద్వేషకర తప్పుడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీసాయో, ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో మీకు తెలుసు.

శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టవద్దని ప్రజలను కోరుతున్నాం

సోషల్ మీడియాలో అలాంటి విద్వేషకర పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారు

అలాంటి పోస్టులు పెట్టిన వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చాం

ప్రజలు పోలీసులతో సహకరించి తెలంగాణ భద్రత, రక్షణలో అత్యున్నత స్థాయి పాటించేలా పోలీసులకు సహకరించాలని విజ్నప్తి

Update: 2020-08-12 14:37 GMT

Linked news