కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పించిన ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు సభ్యులు

ఒంగోలు: ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు మరియు ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు జూనియర్స్ ఆధ్వర్యములో ఆదివారం సాయంత్రం ఒంగోలు బండ్లమిట్ట మంగలిపాలెం కూడలి వద్దగల కార్గిల్ విజయస్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పించినారు.

అమరవీరుల త్యాగాలను స్మరించుకొంటూ దేశ రక్షణలో తమవారిని వదలి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఎండనక, వాననక చలిలో శతృమూకల చొరబాటును అడ్డుకొంటూ పహారాకాస్తున్న సైనికులను స్మరించుకోవడం మన కర్తవ్యమని ఎయిమ్స్ జాతీయ అధ్యక్షులు జంధ్యం రాధా రమణ గుప్తా ఉధ్గాటించారు.

ఈ కార్యక్రమములో ఎయిమ్స్ క్లబ్స్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, ఎయిమ్స్ ఒంగోలు కార్యదర్శి నేరేళ్ల శ్రీనివాసరావు, ధనిశెట్టి రాము, చలువాది గొవిందు, గుర్రం కృష్ణ, శెనెగెపల్లి నాగాంజనేయులు "ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు జూనియర్స్" అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ మీనాక్షి, మీనాశ్రీలు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.




Update: 2020-07-26 14:53 GMT

Linked news