ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులంతా పాస్‌..

- తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- విద్యార్థులందరికీ 35 మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

- ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతిలో 35 వేలు, ఇంటర్‌లో 43 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.

- కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని ఓసెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే.

- ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Update: 2020-07-24 13:50 GMT

Linked news