కలెక్టర్ ఆదేశాలతో తాడిపత్రికి కరోనా పరీక్షల నిమిత్తం సంజీవిని వాహనం

తాడిపత్రి: అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణంలోని తేరు బజార్, మెయిన్ బజార్ ప్రాంతాల్లో కరోనా పరీక్షల నిమిత్తం సంజీవిని వాహనం మంగళవారం సైతం వస్తున్నట్లు సంబంధిత డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

మెయిన్ బజార్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, అనుమానం ఉన్న వారు, 60 ఏళ్ల పైబడిన వారు కరోణ పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా పరీక్షలు చేయించుకోదలచిన ప్రజలు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్లతో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్ తెలిపారు. 

Update: 2020-07-21 13:01 GMT

Linked news