వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింట సర్వే

గొల్లప్రోలు: పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ప్రారంభించారు. ఆశా వర్కర్లు వారికి కేటాయించిన నెలలో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా జ్వరం, రొంప, కరోనా వైరస్ లక్షణాలు ఉంటే తక్షణం వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే తక్షణం కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.




Update: 2020-07-19 12:05 GMT

Linked news