టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగింపు

తిరుపతి: టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో గా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈవోగా కొనసాగాలని ఉత్తర్వులో తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో టిటిడి 25వ ఈవోగా డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు.

- రెండేళ్ల పాటు ఉండే ఈ పదవిలో ఏపీ ప్రభుత్వం 2019లో మరో ఏడాది డిప్యూటేషన్‌ను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లేటెస్టుగా రెండోసారి డిప్యూటేషన్‌ను పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈవో కొనసాగాలని స్పష్టం చేసింది.

Update: 2020-07-19 05:09 GMT

Linked news