భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో కాల్పులు

- మల్లెపల్లి తొగు అటవీప్రాంతంలో పోలీసు బృందాలకు ఎదురుపడిన మావోయిస్టులు

- పోలీసులు... మావోల మధ్యలో ఎదురు కాల్పులు

- తృటిలో తప్పించుకున్న మావోయిస్టులు

- తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ రోజు ఉదయం 9గంటలకు మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో మావోయిస్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.అనంతరం పోలీసులను చూసి వారికి సంబంధించిన సామాగ్రిని వదిలిపెట్టి పారిపోయిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు.

Update: 2020-07-15 06:30 GMT

Linked news