అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: డీకే అరుణ, బీజేపీ నాయకురాలు

వరంగల్ జిల్లా కేంద్రంలో బిజెపి కార్యాలయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ పాలనపై బిజెపి సాగిస్తున్న పోరాటాలకు రాష్ట్రంలో ఆదరణ పెరుగుతుందన్న భయాందోళనతోనే

బీజేపీ నేతలపై టిఆర్ఎస్ దాడులకు పాల్పడుతుంది

రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ ప్రభుత్వంలోని కమీషన్ల కాంట్రాక్టర్లుగా, భూ కబ్జాదారులుగా మంత్రులు ఎమ్మెల్యేలంతా సామాన్య ప్రజలన భయభ్రాంతులకు గురిచేస్తూ పీడిస్తున్నారు

నేడు తెలంగాణ రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది మాఫియా గుప్పిట్లో అరాచకాలకు అక్రమార్కులకు కెసిఆర్ ప్రభుత్వం నిలువెత్తు నిదర్శనం గా మారిపోయింది

ఎమ్మెల్యేలు నరేందర్ వినయ్ భాస్కర్ లపై కేసులు నమోదు చేయాలి

సంఘటనా స్థలంలో ఉన్న దాడిని నిలువరించని పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి

Update: 2020-07-12 14:00 GMT

Linked news