అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

అంబాజీపేట: మండలంలోని మాచవరం గ్రామపంచాయతీ పరిధిలోని కోఠివారి అగ్రహారంలో ఒక వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ఎస్.ఐ షేక్ జానీ బాషా సిబ్బందితో కలిసి మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

- దీనికి సంబంధించి ఎస్.ఐ జానీ బాషా తెలిపిన వివరాల ప్రకారం కోఠివారి అగ్రహారంలో మద్యం విక్రయిస్తున్న వాసంశెట్టి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి, మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. అదుపులో తీసుకున్న వ్యక్తిని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలియజేశారు.

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యాన్ని నిల్వచేయడం, విక్రయించటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారి వివరాలు నా ఫోన్ నెంబర్ 944 0796 563కు తెలియజేయాలని జానీ బాషా తెలిపారు.

Update: 2020-07-12 11:09 GMT

Linked news