కోరుకొండ లో మాజీ ఎమ్మెల్యే నిరసన దీక్ష

కోరుకొండ : రాజనగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆదివారం కోరుకొండ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.

- అమరావతి రాజధానిగా కొనసాగించాలని అక్కడి రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా 200 రోజులు అయిన సందర్భంగా ఈ దీక్షలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

- అదేవిధంగా తెలుగు దేశం పార్టీ బీసీ నాయకుల అరెస్టులకు నిరసన వ్యక్తం చేశారు.

- బీసీ నాయకులను అరెస్టు ద్వారా వేధించటం అధికార పార్టీ పాల్పడుతుందని అన్నారు.

- ఈ నిరసన కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు మింగి లక్ష్మీనారాయణ, తెలుగం శెట్టి శ్రీను, నాగ రమేష్, దిడ్డి మాధవరావు, కొయ్య సామ్యూల్ పరసా శ్రీను వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. 



Update: 2020-07-04 06:42 GMT

Linked news