పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించాలి

పెందుర్తి: లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఉపాధి కోల్పోయి ఇళ్లకు పరిమితం అయితే కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకిపెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం బాధాకరం అని అనకాపల్లి పార్లిమెంటరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుత్తల శ్రీరామ్ మూర్తి, పీసీసీ జనరల్ సెక్రటరీ బొడ్డు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడారి రమేష్ నాయుడు కేంద్ర ప్రభుత్వ తీరు పై నిరసన వ్యక్తం చేశారు.

- పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నిరసనగా పెందుర్తి లో పెట్రోల్ బంక్ వద్ద ఆడారి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.

- ఈ సందర్భం గా వీరు ముగ్గురు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

- లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పై నిరసన ర్యాలీ లుకొనసాగుతాయని అన్నారు.

- ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ షఫీ, రాము నాయుడు, ఆర్.ఆర్.నాయుడు, పెందుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విన్నకోట రాము, శ్రీరాములు, గండి సన్నిబాబు, లక్ష్మ మోజీ, రమణమ్మ, బి.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.



Update: 2020-07-01 14:56 GMT

Linked news