♦ ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశంసలు



- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ప్రశంసలు కురిపించింది. విశాఖ గ్యాస్‌ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం గొప్పగా వ్యవహరించిందని గుర్తు చేసింది. గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి తక్షణ పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొంది. ప్రభుత్వం మానవతా దృక్పథం, దయార్థ హృదయాన్ని అభినందిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

- న్యాయవాదులను ఆదుకోవాలి : లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న న్యాయవాదులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Update: 2020-06-15 16:51 GMT

Linked news