రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్‌ కేంద్రం దగ్గర ఘర్షణ

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్‌ కేంద్రం దగ్గర వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఓటర్‌ స్లిప్పులపై ఎన్నికల గుర్తులు రాసి పంపుతున్నారంటూ టీడీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్ధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.

Full View


Update: 2021-02-09 04:32 GMT

Linked news