Kedarnath Yatra: కేదార్నాథ్ యాత్ర రికార్డులు.. లక్షల మంది భక్తులు, కోట్ల రూపాయల వ్యాపారం!
Kedarnath Yatra: కేదార్నాథ్ ధామ్ యాత్ర ప్రతేడాది కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఒకవైపు బాబా కేదార్నాథ్ దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కొత్త రికార్డులను నెలకొల్పుతుండగా, మరోవైపు పెరుగుతున్న యాత్ర వల్ల స్థానిక ప్రజల ఉపాధికి కూడా నిరంతరం ప్రయోజనం చేకూరుతోంది.
Kedarnath Yatra: కేదార్నాథ్ యాత్ర రికార్డులు.. లక్షల మంది భక్తులు, కోట్ల రూపాయల వ్యాపారం!
Kedarnath Yatra: కేదార్నాథ్ ధామ్ యాత్ర ప్రతేడాది కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఒకవైపు బాబా కేదార్నాథ్ దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కొత్త రికార్డులను నెలకొల్పుతుండగా, మరోవైపు పెరుగుతున్న యాత్ర వల్ల స్థానిక ప్రజల ఉపాధికి కూడా నిరంతరం ప్రయోజనం చేకూరుతోంది. కేవలం ఒకే నెలలో కేదార్నాథ్ ధామ్ యాత్ర ద్వారా మొత్తం రూ.200 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఇది యాత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆర్థిక ప్రభావాన్ని కూడా స్పష్టం చేస్తోంది.
భక్తుల రికార్డు సంఖ్య
2025 సంవత్సరపు యాత్ర కోసం మే 2న బాబా కేదార్నాథ్ ధామ్ తలుపులు భక్తుల దర్శనార్థం తెరచుకున్నాయి. తలుపులు తెరిచి ఒక నెల సమయం పూర్తయింది. జూన్ 1వ తేదీ ఆదివారం నాటికి బాబాను దర్శించుకున్న భక్తుల సంఖ్య 7 లక్షలు దాటింది. అంటే సగటున ప్రతి రోజూ 24 వేల మంది భక్తులు బాబా దర్శనం కోసం కేదార్పురి చేరుకున్నారు. ఈ భారీ సంఖ్య యాత్ర పట్ల ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని, ఆసక్తిని తెలియజేస్తుంది.
వివిధ సేవల ద్వారా భారీ ఆదాయం
కేదార్నాథ్ ధామ్ యాత్ర చాలా కఠినమైనది. ఇలాంటి కఠినమైన మార్గంలో భక్తులు తమ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవడానికి వివిధ రకాల రవాణా సేవలను ఆశ్రయిస్తారు. ఈ సేవలు స్థానిక ప్రజలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి.
కంచర గాడిదల ద్వారా రూ.40.5 కోట్ల ఆదాయం
ప్రధాన పశు వైద్య అధికారి డాక్టర్ ఆశిష్ రావత్ తెలిపిన వివరాల ప్రకారం..మే 31 నాటికి 1,39,444 మంది యాత్రికులు గుర్రాలు, కంచర గాడిదల ద్వారా దర్శనానికి చేరుకున్నారు. దీని ద్వారా రూ.40 కోట్ల 50 లక్షలకు పైగా ఆదాయం లభించింది.
హెలికాప్టర్ సేవల ద్వారా రూ.35 కోట్ల వ్యాపారం
కేదార్నాథ్ ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. నడవడానికి వీలులేని లేదా శారీరకంగా బలహీనంగా ఉన్న భక్తులకు హెలికాప్టర్ సేవలు బాబా దర్శనానికి అవకాశం కల్పిస్తాయి. మే 31 నాటికి సుమారు 33,000 మంది భక్తులు హెలికాప్టర్ సేవల ద్వారా బాబా కేదార్నాథ్ ధామ్ చేరుకున్నారు. దీని ద్వారా దాదాపు రూ.35 కోట్ల ఆదాయం లభించింది.
పల్లకీల ద్వారా కూడా ఆదాయం
కేదార్నాథ్ ధామ్ నడక మార్గంలో గుర్రాలు, కంచర గాడిదల నిర్వహణ ఎంత ముఖ్యమో పల్లకీల నిర్వహణ కూడా అంతే ముఖ్యం. నడవలేని చాలా మంది భక్తులు పల్లకీల ద్వారా ప్రయాణించడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లల విషయంలో కూడా ఇది సురక్షితమైనదిగా పరిగణిస్తారు. మే 31 నాటికి 29,275 మంది భక్తులు పల్లకీ ద్వారా యాత్ర చేశారు, దీని ద్వారా రూ.1 కోటి 16 లక్షల 89 వేల 100 రూపాయల ఆదాయం లభించింది.
టాక్సీల ద్వారా దాదాపు రూ.7 కోట్ల ఆదాయం
ఈ ఏడాది కేదార్నాథ్ ధామ్ యాత్రలో షటిల్ సేవ కోసం 225 వాహనాలు నమోదు చేయబడ్డాయి. ఈ వాహనాల్లోనే భక్తులు సోనప్రయాగ్ నుండి గౌరీకుండ్ వరకు చేరుకుంటారు. జూన్ 1వ తేదీ నాటికి 7 లక్షల మందికి పైగా భక్తులు ధామ్కు చేరుకున్నారు. ప్రతి యాత్రికుడు వెళ్ళడానికి రూ.50, తిరిగి సోనప్రయాగ్కు రావడానికి రూ.50 చెల్లించాలి. అంటే ఇప్పటివరకు టాక్సీ ఆపరేటర్లు షటిల్ సేవ ద్వారా దాదాపు రూ.7 కోట్ల రూపాయలు సంపాదించారు.
హోటల్స్ ద్వారా భారీ వ్యాపారం
కేదార్నాథ్ ధామ్ యాత్ర మార్గం, కేదార్పురిలో భక్తులకు వసతి సౌకర్యాలను స్థానిక వ్యాపారులు అందిస్తారు. కేదార్నాథ్ ధామ్ యాత్ర మార్గం నుండి కేదార్పురి వరకు స్థానిక ప్రజలకు వందలాది హోటళ్లు, టెంట్లుచ, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో భక్తులు బస చేయడానికి, ఆహారం కోసం ఆగుతారు. యాత్రకు వచ్చే ఒక యాత్రికుడికి బస, ఆహారం కోసం సగటున కనీసం రూ.1500 నుండి రూ.2000 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో కొందరు తమ ఆహారాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకుంటారు. ఒక నెలలో యాత్రకు చేరుకున్న భక్తుల సగటును లెక్కించినట్లయితే సుమారు రూ.100 కోట్ల వ్యాపారం చేశాయి. మొత్తంగా, కేదార్నాథ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక అనుభూతిని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన బూస్ట్ అందిస్తుంది.