గిరిజనులకు 50 ఏళ్లకే వృద్ధాప్య ఫించను

Update: 2019-02-11 02:11 GMT

ఇప్పటికే పింఛన్ల డ్వాక్రా మహిళలు, ఉద్యోగుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు 50 ఏళ్ల నుంచే వృద్ధాప్య ఫించన్ ఇవ్వనున్నట్లు ఏపీప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను తయారు చెయ్యాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు లబ్దిదారులు వివరాలు నమోదు చేయాలని ఎంపీడీవోలకు జారీ చేసిన ఆదేశాల్లో సెర్ప్ స్పష్టం చేసింది. కాగా ప్రభుత్వ ప్రకటనతో గిరిజనులకు కొంత మేర ప్రయోజనం చేకూరనుంది. ఇదిలావుంటే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఏపీ ప్రజలను ఆకట్టుకుంటున్నారు సీఎం చంద్రబాబునాయుడు. 

Tags:    

Similar News