తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.